Breaking News

యుద్ధనౌక గద్దర్ కు ఘనమైన నివాళి:సాన్నేం శ్రీనివాస్ గౌడ్.


రాజేంద్ర నగర్,(ప్రజాకోట):పాటలతోని ప్రభుత్వల గుండెల్లో రైలు పరిగెత్తించి ప్రజా సమస్యలు తీర్చిన గొప్ప మహాకవి,యుద్ధ నౌక గద్దర్ అని మాజీ పీసీసీ కార్యదర్శి సాన్నెం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.సోమవారం
రాజేంద్రనగర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆరాంఘర్ చౌరస్తాలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర మాటలే పాటలుగా మలచి ప్రజలను చైతన్యం చేసిన ప్రజా యుద్ధ నౌక,శ్రీ గద్దర్ అన్న మరణించడం ఎంతో బాధాకరం అని తెలియపరుస్తూ అయన చిత్రపటానికి ఘనమైన నివాళి అర్పించడం జరిగిందని మాజీ పీసీసీ కార్యదర్శి సాన్నెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి సాన్నెం శ్రీనివాస్ గౌడ్,మైలార్దేవపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ ధనుంజయ్,రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కోరని బాల్ రాజ్ బి,బ్లాక్ అద్యక్షులు మహమ్మద్ కాలేజ్,అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు ఏం భాస్కర్ గౌడ్,రాజేంద్రనగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొండకర్ల నాగేందర్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి,వెంకటేష్,నరసింహ యాదవ్,రవీందర్ రెడ్డి,జనార్ధన్,ఎన్ఎస్ యుఐ నాయకులు మహేష్ ముస్తఫా, సదానంద్ కుమార్,హరి బాబు ముదిరాజ్,చిన్న రామ్ చందర్,తదితరులు పాల్గొన్నారు.